వేములవాడ : వేముల రాజన్న ఆలయం భక్తులలో కిటకిటలాడింది. సోమవారం తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. దైవ దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది.
స్వామి వారికి పూజలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.పునర్వసు నక్షత్రం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అర్చకులు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు.
ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి భక్తులకు లఘుదర్శనం అమలు చేశారు. కాగా సుమారు 50 వేల మంది భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు, పట్టణ ప్రధాన రహదారులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఇబ్బందులు తల్తెకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.