మహబూబ్నగర్ : అవసరాన్ని బట్టి ధాన్యం నిల్వ చేసేందుకు రైతు వేదిక భవనాలు, గ్రామాల్లో ప్రభుత్వ భవనాలను ఉపయోగించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సూచించారు. నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.
ధాన్యం సరఫరా కోసం లారీల ఏర్పాటులో జాప్యం జరగకూడనిదని అధికారులను ఆదేశించారు. ఆన్ లైన్ ప్రక్రియ పూర్తి అయిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందన్నారు. గ్రామాల్లో ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలన్నారు. ఏదైనా సమస్యలు తలెత్తితే వైద్యులను సంప్రదించాలని సూచించారు.