ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి వెల్లడి
వేములవాడ, ఆగస్టు 9: ప్రభుత్వం త్వరలోనే సీపీఎస్ను రద్దు చేయనున్నదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి తెలిపారు. 398 రూపాయల వేతనంతో ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నదని చెప్పారు. సోమవారం వేములవాడ రాజన్నను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం వేములవాడ జడ్పీ బాలికల పాఠశాలలో పీఆర్టీయూ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యల పరిష్కార బాధ్యత పీఆర్టీయూపైనే ఉన్నదని చెప్పారు.