జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సోమవారం దర్శించుకున్నారు. ఆలయంలో పూజలు చేశాక పార్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.