హైదరాబాద్ : సెప్టెంబర్ 8 నుంచి (సీపీజీఈటీ) ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్ పాండు రంగారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ)- 2021 నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది. ఈ నెల 30 నుంచి ఆగస్టు 25 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 500 ఆలస్య రుసుముతో ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. రూ. 2 వేల ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.