అబద్ధాలతో ఓట్లు పొందాలనుకునే వారికి గుణపాఠం తప్పదు
అన్ని వర్గాల ప్రజల మదిని గెలుచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
టీ సీడ్స్ చైర్మన్ కొండబాల, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు
మధిర, మార్చి 13: ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం ఖాయమని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలకు పథకాలు, ఉద్యోగులకు ప్రయోజనాలు అందించి సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల మనసులనూ గెలుచుకున్నారని అన్నారు. అబద్ధాలు ప్రచారం చేసి ఓట్లు పొందాలంటే వారికి ఈ ఎన్నిక గుణపాఠం అవుతుందని అన్నారు. పల్లాకు ప్రథమ ప్రాధాన్య ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు సైతం విదేశీ విద్యను అభ్యసించే విధంగా పథకాలు చేపట్టి విదేశీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని గుర్తుచేశారు. మధిర ఏఎంసీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఎంపీపీ మెండెం లలిత, మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, మధిర సొసైటీ అధ్యక్షుడు బిక్కి కృష్ణప్రసాద్, కనుమూరి వెంకటేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, యన్నంశెట్టి అప్పారావు, శీలం వెంకటరెడ్డి, చావా వేణు పాల్గొన్నారు.