సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్గా తెలంగాణ
ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి
వనపర్తికి మెడికల్ కళాశాల మంజూరుపై ధన్యవాదాలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తిలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
వనపర్తి, మే 18 : సీఎం కేసీఆర్ దార్శనికుడని, ఎక్కడ ఏం చేపట్టాలన్నది ము ఖ్యమంత్రికి తెలుసని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. తెలంగాణ నవనిర్మాణంపై కేసీఆర్ 2001లోనే స్పష్టమైన ప్రణాళిక నిర్దేశించుకున్నారని, ఆకలి చావుల తెలంగాణను ఏడేండ్లలో అన్నపూర్ణ తెలంగాణగా మార్చారన్నారు. వైద్యం పూర్తిగా ప్రభుత్వం పరిధిలో ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచనని, దానిని దృష్టిలో ఉంచుకునే ఆదిలాబాద్, మహబూబ్నగర్, సూర్యాపేట, సిద్దిపేటలో నూతన వైద్య కళాశాలలను ప్రారంభించారన్నారు. నూతనంగా వనపర్తితో కలిపి ఆరు మెడికల్, నర్సింగ్ కళాశాలలు మంజూరు చేయడం దేశానికే గర్వకారణమన్నారు. వనపర్తిలో మెడికల్ కళాశాలతో దక్షిణ పాలమూరు జిల్లాకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. రైతుబీమా, రైతుబంధు, ఉచిత కరెంట్, సాగు నీటితో తెలంగాణ వ్యవసాయ రంగ స్వరూపం మారిందని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు.
కరెంట్ కోసం రోడ్డెక్కిన రైతులను కాల్చిచంపిన చరిత్ర ఉమ్మడి రాష్ట్ర పాలకులదని, అసలు విద్యుత్ సమస్యే లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని గుర్తు చేశారు. అత్యద్భుత పారిశ్రామి క విధానంతో దేశానికే తెలంగాణ అడ్డాగా మారిందని, ఐటీ ఉత్పత్తి, సేవా రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. కరోనా విపత్తులోనూ రైతుల వ్యవసాయ ఉత్పత్తులు కొంటున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమేనన్నారు. లక్షల మందికి ఉపాధి కల్పించి సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచామని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
వెయ్యికిపైగా గురుకులాలతో నాణ్యమైన విద్యను అందిస్తూ కొత్త చరిత్రకు శ్రీ కారం చుట్టారని, 2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారన్నారు. ఇందుకుగానూ జి ల్లా ప్రజల తరపున ముఖ్యమంత్రికి ప్రత్యే క ధన్యవాదాలు తెలిపారు.