వర్ధంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): సబ్బండవర్ణాల జీవన తాత్వికతకు, సాంసృతిక చైతన్యానికి గూడ అంజయ్య పాట చిరునామాగా నిలిచిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ భా వాజల వ్యాప్తికి పాటలద్వారా అం జయ్య చేసిన ఉద్యమకృషిని ఆయన వర్ధంతి సందర్భంగా సీఎం స్మరించుకున్నారు. తెలంగాణ స్వయంపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలనే గూడ అంజయ్య ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసి చూపిస్తున్నదని తెలిపారు. ఆ దిశగా పలు అభివృద్ధి, సంక్షేమపథకాలను అమలుచే స్తూ, తెలంగాణ సబ్బండవర్ణాల అభివృద్ధికి పాటుపడుతూ, అం జయ్యకు ఘననివాళి అర్పిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.