హైదరాబాద్ : సింగరేణి వ్యాప్తంగా ఇవాళ మెగా కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరం ప్రారంభమైంది. 12 ప్రాంతాల్లోని 40 కేంద్రాల్లో తొలిరోజు 7,500 మంది సిబ్బంది, కార్మికులకు టీకాలు వేశారు. సింగరేణిలో ఇప్పటివరకు 23,500 మంది (54శాతం) సిబ్బందికి తొలి డోసు పూర్తైనట్లు సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వరంగ బొగ్గు సంస్థల్లో ఇదే తొలి మెగా వ్యాక్సినేషన్ శిబిరమని ఆయన గుర్తుచేశారు. మెగా కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరంలో భాగంగా పది రోజుల్లోపు సుమారు 29 వేల సిబ్బందికి టీకాలు వేయాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.