హైదరాబాద్ : రేపటి నుంచి రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్లకు ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సిన్లను పంపిణీ చేయనుంది. నగరంలో రెండుచోట్ల వ్యాక్సినేషన్ పంపిణీని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు సనత్నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో.. 10 గంటల 30 నిమిషాలకు బన్సీలాల్ పేటలో వ్యాక్సినేషన్ పంపిణీని ఆయన ప్రారంభిస్తారు.
రాష్ట్రంలో కొవిడ్ వైరస్ను వేగంగా వ్యాపింప చేస్తారని భావిస్తున్న సూపర్ స్ప్రెడర్లు 25 లక్షల మందికి పైగా ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. వీరందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. డ్రైవర్లు, వీధి వ్యాపారులు, గ్యాస్ డెలివరీ బాయ్స్, బ్యాంకు ఉద్యోగులు, పెట్రోల్ బంకుల్లో పనిచేసేవారు, ఊరూరు తిరుగుతూ వ్యాపారం చేసేవారంతా ఈ సూపర్ స్ప్రెడర్ల విభాగంలోకి వస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.