హైదరాబాద్ : తెలంగాణలోని సూపర్ స్ర్పెడర్లకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోన్న విషయం విదితమే. ఈ క్రమంలో విద్యుత్ ఉద్యోగులను కూడా సూపర్ స్ర్పెడర్లుగా గుర్తించి.. వ్యాక్సినేషన్ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు కోరారు. విద్యుత్ ఉద్యోగులతో పాటు సిబ్బందికి కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. విద్యుత్ శాఖలో మొత్తం 52 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. విద్యుత్ ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు అంగీకరించిన సీఎం కేసీఆర్కు సీఎండీ ప్రభాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.