corona vaccine : కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు టీకా తప్పనిసరిగా తీసుకోవాలి. మొదటి డోస్ తీసుకున్న నిర్ణీత వ్యవధిలో బూస్టర్ డోసు కూడా వేయించుకోవాలి. అప్పుడే కరోనాను ఎదుర్కొనేందుకు కావాల్సిన సామర్థ్యం వృద్ధి చెందుతుంది. దీనిపై ఇప్పుడు దాదాపుగా అందరికీ అవగాహన వచ్చేసింది. ఇక్కడిదాకా బాగానే ఉంది. మరి కరోనా బారిన పడి కోలుకున్న వారు వ్యాక్సిన్ తీసుకోవాలంటే ఎలా? వాళ్లు కూడా రెండో డోసులు తీసుకోవాలా? ఒక్క డోస్ సరిపోదా? ఇదే విషయమై అధ్యయనం చేసిన హైదరాబాద్కు చెందిన ఏషియన్ గ్యాస్ట్రోఎంటరాలజీ ( ఏఐజీ ) ఆస్పత్రి వైద్య నిపుణులు.. కరోనా నుంచి కోలుకున్న వారికి సింగిల్ డోస్ సరిపోతుందని వెల్లడించారు.
తమ పరిశోధనలో భాగంగా కరోనా సోకిన, కరోనా సోకని 260 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ అందించారు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 మధ్య కాలంలో వీరికి కోవిషీల్డ్ టీకా మొదటి డోస్ ఇచ్చి ఈ పరిశోధన నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్లో ప్రచురితమయ్యాయి.
కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క డోసే సరిపోతుందని ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. వారికి రెండో డోస్ అక్కర్లేదని తెలిపారు. కరోనా సోకని వారితో పోలిస్తే, గతంలో కొవిడ్ సోకిన వారిలో యాంటీబాడీలు మూడింతలు ఎక్కువగా వృద్ధి చెందినట్లు తమ అధ్యయనంలో గమనించినట్లు పేర్కొన్నారు. ఒక్క డోస్తోనే మెమొరీ టీ సెల్స్ గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. అంటే కరోనా నుంచి కోలుకున్న 3-6 నెలల లోపు ఒక డోస్ తీసుకుంటే రెండు డోసులకు సమానమైన వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందని చెప్పారు.
“కరోనా బారిన పడి కోలుకున్న నెల రోజుల తర్వాత టీకా తీసుకోవచ్చు. వీరికి ఒక్క డోస్తోనే మూడింతల యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయి. కాబట్టి వీరికి వ్యాక్సిన్ రెండో డోస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీరికి ఇవ్వాల్సిన రెండో డోస్ టీకాలను ఇతరుల కోసం వినియోగించుకోవచ్చు. దానివల్ల టీకాలపై ఖర్చు తగ్గడంతో పాటు ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ కొరత కూడా తీరుతుంది. దేశంలో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయి.. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించిన తర్వాత వీరికి బూస్టర్ డోస్ ఇవ్వొచ్చు.” అని ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
గతేడాది డిసెంబర్లో వ్యాక్సిన్లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్న సమయంలో యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయన బృందం కూడా ఒక అధ్యయనం మొదలు పెట్టింది. తమ అధ్యయనంలో భాగంగా కరోనా సోకని వారు, కరోనా సోకి తగ్గిన వెయ్యి మందికి ఒక్క డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. వీరిలో కరోనా సోకని వారితో పోలిస్తే.. కరోనా నుంచి కోలుకున్న వారిలో రోగ నిరోధక శక్తి చాలా మెరుగైనట్లు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సుసాన్ చెంగ్ వెల్లడించారు. ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్న వారికి కేవలం ఒక డోసు మాత్రమే ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల డోసుల వ్యాక్సిన్లు మిగిలిపోనున్నట్లు పేర్కొన్నారు.
నిజానికి గత ఫిబ్రవరి నుంచే ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ వంటి యూరోపియన్ దేశాల్లో కరోనా బారిన పడి కోలుకున్న వారికి ఒక్క డోస్ టీకాను మాత్రమే ఇస్తున్నాయి. ఇజ్రాయెల్ అయితే మొదట్లో కరోనా నుంచి కోలుకున్న వారికి అసలు వ్యాక్సినే అవసరం లేదని అనుకున్నప్పటికీ.. తర్వాత ఒక్క డోస్ చాలని తేల్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Post Corona symptoms : కరోనా తగ్గాక జుట్టు రాలుతుందా? ఇలా ట్రై చేయండి
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Coronavirus Doubts : నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్-19 వస్తుందా?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!