మేడ్చల్, మే 28 (నమస్తే తెలంగాణ): బ్లాక్ఫంగస్కు ఆయుర్వేద మందులు ప్రభావవంతంగా పనిచేస్తాయని ప్రభు త్వ ఆయుష్ వైద్యాధికారి ఆర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రతిరోజు గంధక రసాయనం (500 ఎంజీ) రోజుకు మూడుసార్లు భోజ నం తర్వాత ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వసంత కుసుమాకరస(125 ఎంజీ) రెండు సార్లు, వ్యోషాదివటి(250 ఎంజీ) రెండుసార్లు, సంశనవటిలను వేసుకొంటూ సుబ్రభస్మ(500 ఎంజీ)మందును 50ఎంఎల్ గోరువెచ్చని నీటిలో కలిపి నోటితో పుక్కిలించాలని వివరించారు. కరోనా తగ్గాక స్టెరాయిడ్స్ దుష్ప్రభావం ఉండకుండా నెలపాటు ఈ మందులను వాడాలని సూచించారు. వ్యాధినిరోధకశక్తిని పెంచుకొనేందుకు ఆకుకూరలు, వివిధ రకాల పండ్లు తినాలని పేర్కొన్నారు. బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని, ఇది ఇతరులకు సోకదని పేర్కొన్నారు.