ఖమ్మం : కోవిడ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, థర్డ్ వేవ్లో చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న వార్తల నేపథ్యంలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న పిల్లల కోసం ప్రత్యేక కోవిడ్ సంరక్షణ కేంద్రంను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.
గడచిన తొలి దశ, ప్రస్తుత రెండవ దశలో కోవిడ్ను సమర్ధవంతంగా ఎదుర్కోగలిగామని, అయితే 3వ దశను ముందస్తుగానే ఊహించి వైరస్ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా 40బెడ్స్ తో వెంటిలేటర్, ICU, SICUలతో పాటు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్, DM&HO మాలతి, డిప్యూటీ మేయర్ ఫాతిమా, ఆసుపత్రి సూపరింటెండెంట్ బి వెంకటేశ్వర్లు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.