కసరత్తు చేస్తున్న విద్యాశాఖ అధికారులు
జిల్లాలో 3,600 మంది ఉపాధ్యాయులు
ఐడీకార్డులో 13 అంశాలతో పూర్తి వివరాలు
24లోపు వివరాలు పంపాలని ఆదేశాలు
ఆలేరు టౌన్, ఏప్రిల్ 21: రాష్ట్రంలోని అన్ని శాఖల్లో పని చేస్తు న్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులను అంద జేస్తుంది. అయితే సంవత్సరాలు తరబడి పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు లేవు. ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు హెచ్ఎంలు, ఎంఈవోలు కార్డులు ఇచ్చేవారు. ఈ విషయమై పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించుకుంది. దీంతో ఎట్టకేలకు టీచర్లకు గు ర్తింపు కార్డులు ఇచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. యా దాద్రి జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, జిల్లా పరిష త్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, టీఈఆర్ఐఎస్, అర్బన్ రెసిడె న్షియల్, మైనారిటీ రెసిడెన్షియల్ తదితర పాఠశాలల్లో సుమారు 3600మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ త్వ రలో గుర్తింపు కార్డులు అందనున్నాయి. ఉపాధ్యాయులు గతం లో డీఈవో వెబ్సైట్లో నమోదు చేసుకున్న వివరాలను, తప్పొ ప్పులను సవరించుకునేందుకు ఈ నెల 24 లోపు గడువు విధి స్తూ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. 2019-20 విద్యా సం వత్సరానికి యూడైస్లో పొందుపర్చిన వివరాలను ప్రస్తుతం పరిగణలోకి తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులంతా అట్టి వివ రాలను సరిచూసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తు న్నారు.
వివరాలు తప్పుగా ఉంటే ఐడి కార్డుల్లో కూడా తప్పుగా వచ్చే అవకాశం ఉంది. ఈనెల 24లోగా తప్పులు లేకుండా టీ చర్లతో పాటు డీఈఓలు సర్టిఫై చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఒకసారి గుర్తింపు కార్డు జారీ చేశాక.. అందులో వివరాలు మా ర్చేందుకు వీలుండదని అధికారులు చెబుతున్నారు. వివరాలు నమోదు చేసుకోవాలంటే ఉపాధ్యాయులు.. సంబంధిత వెబ్సై ట్లోకి వెళ్లాలి. ఆన్లైన్ లైన్ మెనూను క్లిక్ చేయాలి. ఆ తరువా త టీచర్ ఐడీ కార్డు ఇన్ఫోఫై క్లిక్ చేసి కొత్త పేజీలోకి వెళ్లాలి. ట్రెజ రీ ఐడీ నెంబర్, మొబైల్ నంబర్ అప్లోడ్ చేయాలి. అనంతరం మొబైల్కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేస్తే ఐడీకార్డుపై ము ద్రించే వివరాలు స్క్రీన్పై ప్రత్యక్షమౌతాయి. అవి సరిగా ఉన్నా యా లేదా సరి చూసుకోవాలి. చేర్చాల్సిన వివరాలు ఉంటే న మోదు చేయాలి. బ్లడ్గ్రూప్, ఆధార్, పాన్కార్డు నెంబర్లు, ఉద్యో గ గుర్తింపు సంఖ్య, ఫోటో, పేరు, తండ్రి పేరు, హోదా, పని చేస్తున్న పాఠశాల చిరునామా, పుట్టిన తేదీ, ఇంటి చిరునామా వంటి 13 వివరాలు ఉంటాయి. ఇట్టి కార్డును రకాల సేవలకు ప్రామాణికంగా తీసుకోనున్నట్లు సమాచారం. ఈ కార్డు ద్వారా సీనియార్టీ ప్రాతిపదికన జరిగే పదోన్నతులు, బదిలీల్లో జరిగే అక్రమాలను నిరోధించవచ్చునని అధికారులు భావిస్తున్నారు.