కులకచర్ల, ఏప్రిల్ 8: అర్హులైన రైతులు ఉపాధిహామీ పథకం ద్వారా కల్లాలను ఏర్పాటు చేసుకోవచ్చునని ఇన్చార్జి ఎంపీవో శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం కులకచర్ల మండల పరిధిలోని కామునిపల్లి గ్రామంలో నిర్మించిన కల్లాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా సన్నకారు రైతులకు కల్లాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో మల్లికార్జున్, ఈసీ చంద్రశేఖర్, గ్రామస్తులు బాల్రెడ్డి, లాలయ్య, బాలయ్య పాల్గొన్నారు.
పశువుల పాక నిర్మాణానికి కొలతలు
దోమ, ఏప్రిల్ 8 : ఉపాధి హామీ పథకంలో భాగంగా పశువుల పాక నిర్మాణానికి కొలతలు తీసుకున్నట్లు ఏపీవో వెంకటేష్గౌడ్ తెలిపారు. దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామానికి చెందిన మొగులయ్య పొలంలో పశువుల పాక నిర్మాణానికి గురువారం కొలతలు వేశామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా కల్లాలు, పశువుల పాకలు, మినీ కోళ్ల షెడ్లు తదితర పనులను చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
గుండాల తండాలో..
ఉపాధి హామీ పనులను సద్వినిమోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి మోహన్ కాయక్ అన్నారు. మండల పరిధిలోని గుండాల తండాలో గ్రామస్తులతో సమావేశమై 3 గ్రూపులకు సంబంధించిన వారితో పనులకు డిమాండ్లను తీసుకున్నట్లు కార్యదర్శి మోహన్ కాయక్ తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ లాల్యానాయక్, టీఏ వీరేంద్రబాబు, కూలీలు పాల్గొన్నారు.
పనులను సద్వినియోగం చేసుకోవాలి
కులకచర్ల, ఏప్రిల్ 8: ఉపాధిహామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని పటేల్చెరువుతండా సర్పంచ్ శాంతిబాయి అన్నారు. గురువారం కులకచర్ల మండల పరిధిలోని పటేల్చెరువుతండాలో ఉపాధిహామీ పథకంలో పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి కూలీ పనులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు తులసీరాం. గ్రామస్తులు, ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు.
కూలీ డబ్బును పెంచాలి
యాలాల, ఏప్రిల్ 8 : కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్లో నిర్వీర్యం చేస్తున్నదని తెలంగాణ వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్కయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల పరిధిలోని ఎనికెపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనిని పర్యవేక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూలీ డబ్బును రూ.200 నుంచి రూ.600కు పెంచాలన్నారు. ప్రతి కూలీకి సంవత్సరానికి 200 పనిదినాలను కల్పించాలన్నారు. కార్యక్రమంలో కృష్ణప్ప, రాములు, లక్ష్మీ పాల్గొన్నారు.