న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఆయన ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. రేపు సాయంత్రం వర్చువల్గా జస్టిస్ బోబ్డే వీడ్కోలు సమావేశం నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ర్టపతి భవన్లో 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ చేత రాష్ర్టపతి రామ్నాథ్ కొవింద్ ప్రమాణం చేయించనున్నారు. ఈ క్రమంలో నేడు జస్టిస్ బోబ్డేతో జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనంలో కూర్చోనున్నారు.
కొవిడ్ దృష్ట్యా కొద్దిమంది అతిథుల సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, కేబినెట్ సెక్రటేరియట్ అధికారులు, న్యాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొననున్నారు.