హైదరాబాద్ : రాష్ట్రంలోని న్యాయస్థానాలన్నీ జూన్ 30 వరకు వర్చువల్ హియరింగ్ను కొనసాగించనున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ, జస్టిస్ ఎంఎస్ రామ్చంద్రరావు, జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు వెలువరిస్తూ జూన్ 30 వరకు రాష్ట్రంలోని అన్ని కోర్టులు వర్చువల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించాలని ఆదేశించింది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని బెంచ్ ఈ ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు వేసిన రిట్ పిటిషన్ను సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది.