సిద్దిపేట : ఈ నెల 29వ తేదీన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీలను తెరిచి లెక్కింపు జరుపనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకున్న కానుకలతో స్వామి వారి హుండీలు నిండినట్లు తెలిపారు. లాక్డౌన్ కారణంగా హుండీలను లెక్కించ లేదన్నారు.
కాగా హుండీ లెక్కింపు సందర్భంగా పోలీస్, రెవెన్యూ, బ్యాంకు అధికారులు, ఉద్యోగులతో పాటు ఆలయవర్గాలు సకాలంలో హాజరుకావాలని కోరారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు మధ్య, దేవాదాయశాఖ అధికారులు పర్యవేక్షణలో లెక్కింపులు జరుపుతామన్నారు.
ఇవి కూడా చదవండి..
మద్యం డోర్ డెలివరీ చేస్తానంటూ మోసం
త్వరలో సోమశిల- సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం
న్యాయవాది వృత్తిలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అసంపూర్తి పనులు సత్వరమే పూర్తి చేయాలి
మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గండ్ర