రెండు దశల్లో కౌంటింగ్

- సందేహాత్మక బ్యాలెట్లపై ఆర్వోలదే తుది నిర్ణయం: ఎస్ఈసీ పార్థసారథి వెల్లడి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు కేంద్రాలపై ఆర్వో (రిటర్నింగ్ అధికారి)కే సంపూర్ణ అధికారం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఆర్వోలతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు రెండు దశల్లో ఉంటుందని చెప్పారు. మొదటి దశలో బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పేపర్లను మడత విప్పకుండా లెక్కించి కట్ట కడుతారని తెలిపారు. ఆ తరువాత రెండో దశలో ఆ బండిళ్లను అభ్యర్థి వారీగా లెక్కిస్తారని వివరించారు. సందేహాత్మక బ్యాలెట్ పేపర్లపై రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని చెప్పారు. సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లకు అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఎవరికి కేటాయించిన టేబుళ్ల వద్ద వారే కూర్చునేలా చూడాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలించడానికి 30 డీఆర్సీ కేంద్రాలకు 30 పరిశీలకులను నియమించామని, వారి ఆమోదం పొందాకే ఆర్వో ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని స్పష్టంచేశారు. కౌంటింగ్లో భాగంగా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ పేపర్ల లెక్కింపును రిటర్నింగ్ అధికారి టేబుల్ దగ్గర, ఆ తరువాత ఇతర బ్యాలెట్ పేపర్ల లెక్కింపును 8.10కి కౌంటింగ్ టేబుళ్ల దగ్గర మొదలు పెట్టాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 34,50,331 మంది ఓటు హక్కు వినియోగించుకొన్నారని, 1926 పోస్టల్ బ్యాలెట్లను జారీ చేశామని తెలిపారు.
తాజావార్తలు
- 18 వరకు మహారాష్ట్రలో టీకా నిలిపివేత. కొవిన్ వల్లే?!
- రామునిపట్ల వద్ద రెండు బైక్లు ఢీ: ఇద్దరు మృతి
- రూపేశ్ను హతమార్చింది కిరాయి హంతకులే: బీహార్ డీజీపీ
- సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని
- వాటాల ఉపసంహరణే దిక్కు: రాజన్
- శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
- త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం
- ముఖేశ్ ‘రిలయన్స్’కే శఠగోపం..6.8 కోట్ల చీటింగ్
- బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..