చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమీ మరో Mi 11 స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది. షియోమీ త్వరలో ఎంఐ 11 లైట్ను భారత్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. లాంచ్ డేట్ను ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.ఎంఐ 11 ఆల్ట్రా, ఎంఐ 11ఐ స్మార్ట్ఫోన్లతో పాటు ఎంఐ 11 లైట్ 5జీ, 4జీ వేరియంట్లను ఈ ఏడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంఐ 11 ఆల్ట్రాను మాత్రమే షియోమీ భారత్లో రిలీజ్ చేసింది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న ఏకైక ఎంఐ 11సిరీస్ ఫోన్ ఇదే. త్వరలో Mi 11 Lite 4G మోడల్ను భారత్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Mi 11 Lite స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.55 అంగుళాలు
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732జీ
ఫ్రంట్ కెమెరా:64+8+5 మెగా పిక్సెల్
ర్యామ్: 6జీబీ
స్టోరేజ్: 64జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 4250mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11