ముంబై: మహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. నిన్నటి వరకు రోజుకు 50వేలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు..సోమవారం ఆ సంఖ్య భారీగా తగ్గింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 37,236 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల 549 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,90,818కు చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య 51,38,973కు చేరింది. ముంబైలోనూ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో వ్యాప్తి తగ్గుతోంది. ముంబైలో 24 గంటల్లో 1,794 మందికి పాజిటివ్గా తేలింది. కరోనా వల్ల 74 మంది ప్రాణాలు కోల్పోయారు.