వరంగల్ రూరల్ : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు కలిసి వచ్చి కొవిడ్ బాధితులకు అండగా నిలువాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. కరోనా సోకి హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న పాలకుర్తి నియోజకవర్గంలోని కరోనా రోగులకు మంత్రి అండగా నిలిచారు. అందులో భాగంగానే వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో ఎర్రబెల్లి దయాకర్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు ఆయన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా సోకి హోం ఐసోలేషన్లో ఉంటున్న వారికి సుమారు 4 వేల రూపాయల నిత్యావసర వస్తువుల కిట్లను ఇంటి వద్ద అందే విధంగా చర్యలు తీసుకొంటున్నట్లు ఆయన తెలిపారు.
కరోనా చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఔషధాలను క్రమం తప్పకుండా వాడి వైరస్ను జయించాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ బారిన పడినవారు అధైర్య పడొద్దని ఆయన సూచించారు. పాలకుర్తి నియోజకవర్గంలో కోవిడ్ బాధితులకు ఎర్రబెల్లి దయాకర్రావు చారిటబుల్ ట్రస్ట్, దాతలు, స్వచ్ఛంద సంస్థల ప్రస్తుతం 40 లక్షల రూపాయల విలువైన నిత్యావసర వస్తువులు, మాస్కులు, డ్రైఫ్రూట్స్, భోజనాలు పంపిణీ చేశామన్నారు.
కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, ఎంపీపీ అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహనాయక్, మండల సమన్వయ సమితి అధ్యక్షుడు ఆకుల సురేందర్, సీనియర్ నాయకులు బిళ్లా సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
గన్తో డిప్యూటీ తహసీల్దార్ హల్ చల్
ఆక్సిజన్ ప్రాముఖ్యం వెలకట్టలేనిది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి