మొదటి దశలో 5 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ : డీఎంహెచ్ఓ

హైదరాబాద్ : రాష్ట్రంలో నాలుగు దశల్లో 80 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, మొదటి దశలో 5 లక్షల మందికి టీకా ఇవ్వనున్నట్లు డీఎంహెచ్ఓ వెంకట్ తెలిపారు. మొదటగా ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వారియర్స్కు టీకా వేస్తామని ఆయన వెల్లడించారు. రెండో దశలో 50 ఏండ్లు పైబడిన వారికి వేస్తామని చెప్పారు. టీకా పంపిణీ కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. తిలక్నగర్లో ఆయన కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహణ తీరును పరిశీలించి మాట్లాడారు.
క్షేత్రస్థాయి సమస్యలను, చిన్నచిన్న ఇబ్బందులను అధిగమించేందుకే డ్రై రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదిలాఉండగా రాష్ట్రంలో ఇవాళ హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో ఏడుచోట్ల కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహణ కొనసాగుతున్నది. హైదరాబాద్లో గాంధీ దవాఖాన, తిలక్ నగర్ పీహెచ్సీ, నాంపల్లి ఏరియా దవాఖాన, సోమాజిగూడ యశోద దవాఖానతోపాటు మహబూబ్నగర్ జిల్లా కేంద్ర దవాఖాన, జానంపేట పీహెచ్సీ, మహబూబ్నగర్లోని నేహా సన్షైన్ దవాఖానల్లో డ్రై రన్ జరుగుతున్నది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు
- స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ రూ.1000 కోట్లు
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?
- కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.91 లక్షల మందికి కరోనా టీకా