హైదరాబాద్: రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు టీకాలు ఇవ్వనున్ననారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ పరిధిలో 10 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాల పంపిణీ కొనసాగనుంది. టీకాలు వేయించుకునే వారు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ జీరాక్స్ కాపీ తీసుకురావాలని అధికారులు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 లక్షలకుపైగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారని వెల్లడించారు.