మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 22: విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని గిరిజన విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. నాగారం మున్సిపాలిటీలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 14 గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలల నుంచి 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సోమవారం ముగింపు కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ పాల్గొని విద్యార్థులకు రూ.5000 – ప్రథమ, రూ.3000 – ద్వితీయ, రూ.2000 – తృతీయ నగదు బహుమతలను అందజేశారు. కార్యక్రమంలో సంస్థ సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మి, ఉప కార్యదర్శి వాసంతి పిళ్ల్తె, జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ అంజయ్య, అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.