రెండు నెలల క్రితం వరకూ ఆమె సాధారణ గృహిణి. కానీ ఇప్పుడు, ప్రపంచమంతా ఆ ప్రతిభను మెచ్చుకుంటున్నది. ఫ్యాషన్ మ్యాగజైన్ ‘వోగ్’ ఇటాలియన్ ఎడిషన్లో ప్రచురితమైన తన విజయ
గాథతో మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచింది మధ్యప్రదేశ్కు చెందిన సీతా వాసునియా. స్థానిక కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘ఏక్ జిల్లా ఏక్ ఉత్పాద్’ (ఒక జిల్లా – ఒక ఉత్పాదన) అనే పథకాన్ని ప్రారంభించింది. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా.. ఆదివాసీ హస్తకళలైన ఫ్యాబ్రిక్ ప్రింటింగ్, బాగ్ ప్రింట్, డాబు, బాతిక్ ప్రింటింగ్లకు ప్రసిద్ధి. ఈ కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్యాబ్రిక్ ప్రింటింగ్లో శిక్షణ తీసుకున్న సీత అనే యువతి స్వయంగా 30 మంది మహిళలతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. చేనేత చీరలపై రకరకాల ఆదివాసీ డిజైన్లను ముద్రిస్తూ చేనేత గురించి ప్రపంచానికి తెలిసేలా చేసింది. స్థానిక గిరిజనులకు ఫ్యాబ్రిక్ ప్రింటింగ్లో శిక్షణ ఇస్తున్నది. ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థలతో కలిసి పనిచేసేందుకు ‘లుక్ బుక్’ అనే ప్రత్యేక అనుసంధాన వ్యవస్థను కూడా అభివృద్ధి చేసింది. ఇక్కడ రూపొందిన చీరలను మోడల్స్కి బదులుగా స్థానిక గిరిజన బాలికలు, మహిళలే ధరించి ప్రదర్శిస్తారు. ‘స్వదేశీ ఫ్యాషన్’ పేరుతో తయారవుతున్న ఈ చీరలను జైపూర్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె, భోపాల్ వంటి నగరాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. దీని ద్వారా స్థానిక గిరిజనులు జీవనోపాధిని పొందుతున్నారు.