హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కాబోయే అమ్మలకు కరోనా కష్టం వచ్చింది. నెలవారీ వైద్య పరీక్షల కోసం దవాఖానకు వెళ్లినప్పుడో, ఇంట్లో వారినుంచో గర్భిణులకు మహమ్మారి అంటుకుంటున్నది. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాధించే క్షణాల్లో పాజిటివ్ రావడం వారిలో ఆందోళన కలిగిస్తున్నది. అన్నింటికంటే ముఖ్యంగా కరోనా కాలంలో ప్రవసం అంటేనే భయం వేస్తున్నది. సాధారణంగా గర్భిణుల్లో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుండటంతో వైరస్ వెంటనే వ్యాపిస్తున్నది. గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించే దవాఖానలు, ఆరోగ్య కేంద్రాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తుండటం ఇబ్బందిగా మారింది.