కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించామని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో ఇది ఆరో ఎయిర్పోర్ట్ అని చెప్పారు. ఇకపై కర్నూలు జిల్లా నుంచి కూడా విమాన ప్రయాణాలు చేయవచ్చన్నారు. ఈ నెల 28 నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని చెప్పారు. తొలిదశలో బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైకి విమాన సర్వీసులు నడుపుతామని వెల్లడించారు.
యుద్ధప్రాతిపదికన విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తిచేశామన్నారు. 1008 ఎకరాల్లో, రూ.153 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎయిర్పోర్టులో ఒకేసారి నాలుగు విమానాలు పార్క్ చేసుకునే వీలుందని చెప్పారు. ఎయిర్పోర్టు అందుబాటులోకి రావడంతో న్యాయరాజధాని నుంచి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ ఏర్పడుతుందని చెప్పారు. దీనికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టుగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరీ, రాష్ట్రమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.