ఖమ్మం, మే 19: కరోనా పాజిటివ్ గర్భిణి కవలలకు జన్మనిచ్చింది. ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం కాలనీకి చెందిన ఓ గర్భిణికి నాలుగు రోజుల కిందట పాజిటివ్ వచ్చింది. బుధవారం పురిటి నొప్పులు మొదలవ్వడంతో స్థానిక అంగన్వాడీ టీచర్ స్వర్ణ, మెప్మా ఆర్పీ అన్జుమ్ ఆమెను.. ధైర్యంగా ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ ఆమె కవలలకు (ఓ ఆడ, ఓ మగ శిశువు)కు జన్మనిచ్చింది. పిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.