కేసుల పెరుగుదలే థర్డ్వేవ్కు సంకేతం
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు
విద్యానగర్, ఆగస్టు4: దేశంలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు పేర్కొన్నారు. అప్రమత్తంగా లేకుంటే తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో మీడి యాతో మాట్లాడుతూ.. థర్డ్ వేవ్కు అడ్డుకట్ట వేయాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఆగస్టు చివరి వారం నుంచి అక్టోబర్వరకు థర్డ్వేవ్ తీవ్రంగా ఉండవచ్చని ఐఎంఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఎం వసంతరావు, పొలాస రాంకిరణ్ పేర్కొన్నారు. సమావేశంలో వైద్యులు డీసీ తిరుపతిరావు, విజయలక్ష్మి, వెంకట్రెడ్డి, రవికుమార్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.