హన్మకొండ చౌరస్తా: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. గ్రేటర్ పోరులో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో టీపీసీసీ మెంబర్, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ సోమవారం ప్రకటించారు. ఎన్నికల్లో ఆశించినస్థాయిలో గెలువకపోవడంతోపాటు పార్టీలో విభేదాలు, నాయకత్వం పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో రాజీనామా చేసినట్టు తెలుస్తున్నది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డితో విభేదాలే రాజీనామాకు దారితీశాయని చర్చించుకుంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సైతం రాజేందర్రెడ్డికే వత్తాసు పలుకుతుండడం, కొత్తగా వచ్చిన కొండా దంపతులకు ప్రాధాన్యం ఇస్తుండటంతో పార్టీని వీడుతున్నట్టు తెలుస్తున్నది. 1985లో కాంగ్రెస్లో చేరిన స్వర్ణ 35 ఏండ్లుగా పార్టీలో అనేక పదవుల్లో కొనసాగారు. వరంగల్ మేయర్గా పనిచేశారు. వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా పార్టీ తరఫున పోటీ చేశారు.