నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
నిర్మల్ టౌన్, జూన్ 8 : పంట కల్లాల నిర్మాణాలను వారంలోగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. పంట కల్లాల నిర్మాణాలపై జిల్లా కలెక్టరేట్లో కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమావేశమై మాట్లాడారు. మండల వ్యవసాయ అధికారులు సరిగా పని చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనుల నిర్మాణాలను వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ దశల్లో ఉన్న పనులను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిని సంబంధిత అధికారులు నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. నాణ్యత లోపిస్తే సహించేది లేదని,చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారంలోగా పనులు పూర్తికాకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు సన్నద్ధమవ్వాలని సూచించారు. మొక్కలు ఎక్కడ నాటాలో ముందుగానే నిర్ణయించుకోవాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో సుధీర్కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీలత, జిల్లా పంచాయతీరాజ్శాఖ ఈఈ శంకరయ్య, ఎంపీడీవోలు పాల్గొన్నారు.