కేటీఆర్ చొరవతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందజేత
ఏటూరునాగారం, జూన్ 1: కరోనా బాధితుడికి అవసరమైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అత్యంత వేగంగా సమకూర్చారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎంపీపీ విజయ అక్క కుమారుడు, వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురానికి చెందిన అనిల్కుమార్ హన్మకొండలోని ప్రైవేట్ వైద్యశాలలో కరోనా చికిత్స పొందాడు. టీఆర్ఎస్ నాయకుడు కర్ర రవీందర్ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేసి.. బాధితుడికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను అందించాలని విన్నవించారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ సోమవారం రాత్రి అనిల్కుమార్కు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను అందించే ఏర్పాట్లు చేశారు. వెనువెంటనే కాన్సన్ట్రేటర్ను అందించిన మంత్రి కేటీఆర్కు రవీందర్తోపాటు అనిల్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.