జయశంకర్ భూపాలపల్లి : కరోనా విజృంభణ దృష్ట్యా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భక్తులకు ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే దర్శనం కల్పించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. గర్భాలయ దర్శనానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అభిషేకాలు, కాలసర్ప పూజలు, నవగ్రహ పూజలతో పాటు ఇతర పూజలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..