జగిత్యాల, మే 27: ఏపీ కృష్ణపట్నం ఆనందయ్య మందుతో కరోనా తగ్గలేదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ స్పష్టంచేశారు. కృష్ణపట్నం వెళ్లి మందు తీసుకున్న రోగులు రాత్రంతా కళ్ల మంటతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారని, నేత్ర వైద్యుడిగా తనను సంప్రదించారని తెలిపారు. ఆనందయ్య ఇచ్చే మందుతో కరోనా తగ్గితే పాదాభివందనం చేసి, ఆయన మందులు కొనసాగిస్తామని చెప్పారు. గురువారం జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఏరియా దవాఖానలో కొవిడ్ వార్డును పరిశీలించి.. రోగులతో మాట్లాడారు. కరోనా రోగులకు వైద్యులు అత్యాధునిక పరిజ్ఞానంతో సేవలందిస్తున్న సమయంలో కృష్ణపట్నం మందు సరైనదికాదని అభిప్రాయపడ్డారు. ప్రజలు అపోహలు వీడి ప్రభుత్వం ఇచ్చే మందులు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.