మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
మంచిర్యాల టౌన్, మే 16 : కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో లాక్డౌన్ అమలుతీరును విప్ బాల్క సుమన్, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. అనవసరంగా ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తిచేశారు.