హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రైతుబంధు సాయం జూన్ 15 నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో రైతులు వారివారి బ్యాంకు అకౌంట్ నంబర్లను సరి చూసుకోవాలని అధికారులు సూచించారు. ఆంధ్రాబ్యాం కు, దేనా బ్యాంకు, విజయ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, సిండికేట్ బ్యాం కు ఇతర బ్యాంకుల్లో విలీనం అయ్యాయి. దీంతో ఆయా బ్యాంకు ఖాతాదారుల అకౌంట్ నంబర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్ మారాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మరోసారి బ్యాంకులకు వెళ్లి నూతన అకౌంట్ నంబర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్ నంబర్లను తీసుకొని ఆయా క్లస్టర్లకు చెందిన ఏఈవోలకు అందించాలని కోరా రు. బ్యాంకు అకౌంట్ మార్చుకోవాలనుకునే వారు కూడా కొత్త అకౌంట్ నంబర్ అందించాలని సూచించారు. భూముల క్రయ విక్రయాలు, వారసత్వ క్రమంలో కొత్త పాస్బుక్లు వచ్చిన వారు రైతుబ ధు కోసం కొత్తగా నమోదు చేసుకోవాలని కోరారు. జూన్ 10 వరకు సంబంధిత ఏఈవోలకు కొత్త పాస్బుక్తోపాటు బ్యాంకు ఖాతా వివరాలు అందించాలన్నారు.