పల్లెప్రగతిలో ముందంజ
అన్ని వసతులతో వైకుంఠధామం నిర్మాణం
ప్రత్యేక ఆకర్షణగా ప్రకృతి వనం
ప్రధాన రోడ్డు మార్గంలో ఏపుగా పెరిగిన చెట్లు
శిథిల ఇండ్లు, పెంటకుప్పల తొలగింపు
రాయికోడ్, మార్చి 23 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల రూపురేఖలు మారాయి. దీంతో ఇటికెపల్లి గ్రామం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామానికి ట్రాక్టర్లు, డంపింగ్యార్డు, వైకుంఠధామం, నర్సరీ, పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేశారు. మండలంలోని ఇటికెపల్లి పంచాయతీ పాలకవర్గం ప్రభుత్వం చేపట్టిన పథకాలు, నిధులను సక్రమంగా వినియోగించుకోవడంతో గ్రామం అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. గ్రామ సర్పంచ్ విట్ట మ్మ కిష్టారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఎస్ఎప్సీ, టీఎఫ్సీ, జీపీ ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, తాగునీటి సరఫరాకు పంపుసెట్లు, వీధిలైట్లు ఏర్పాటు చేశారు. ఉపాధిహామీ పథకం కింద రూ.10.50 లక్షలతో శ్మశానవాటిక, రూ.2.50 లక్షలతో డంపింగ్యార్డు, గ్రామంలో జనరల్ కమిటీ హాల్ రూ.10 లక్షలు, పశువైద్యశాల నిర్మాణం కోసం రూ.8 లక్షలు, గ్రామానికి కలుపుతూ పోయే రోడ్డు నిర్మా ణం కోసం రూ.4.50 కోట్లు మం జూరు, రూ. 22 లక్షలతో రైతు వేదిక నిర్మాణం, 30రోజుల పల్లె ప్రగతి గ్రామ చివరిలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలను సంరక్షిస్తున్నారు. ఏపుగా పెరిగిన మొక్కలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి వనంలో ఉదయం కాలినడక కోసం ట్రాక్ ఏర్పాటు చేశారు. అలాగే, సేద తీరదానికి అనువుగా బెంచీలను ఏర్పాటు చేశారు. మండలస్థాయి, జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణలో గ్రామం అభివృద్ధి చెందింది.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
ప్రభుత్వం చేపట్టిన రెండు విడుత పల్లె ప్రగతి ప్రణాళిలో భాగంగా గ్రామంలో నెలకొన్న సమస్యలు తొలగిపోయాయి. గ్రామంలో పచ్చదనం, పారిశుధ్యం, ఇంకుడు గుం తలు, సీసీ రోడ్లు, మురుగు కాల్వలతో పాటు పార్కు, పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశాం. అభివృద్ధిలో గ్రామస్తులందరూ భాగ స్వాములు అవుతున్నారు. ఇదే స్ఫూర్తితో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, కలెక్టర్ హనుమంతరావు సహకారంతో గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శంగా తీర్చుదిద్దుతాం.
-విఠమ్మకిష్టారెడ్డి, గ్రామ సర్పంచ్
గ్రామాభివృద్ధికి ప్రత్యేక కృషి
పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఇటికెపల్లి అభివృద్ధికి తనవంతు సహాయం ఎల్లప్పుడు ఉంటుంది. ఎంపీపీ నిధులతో గ్రామం లో అవసరమైన పనులు చేయిస్తా. ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సహకారంతో మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం.
-యూ.పండరి, ఎంపీటీసీ ఇటికెపల్లి
సమస్యలు తొలగిపోయాయి..
పల్లెప్రగతితో గ్రామం లో అనేక అభివృద్ధి పను లు జరిగాయి. పాడుబడ్డ బావులు, శిథిలాల ఇం డ్లను తొలిగించాం. గ్రామానికి రోడ్డు లేక అనేక ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుతం రోడ్డు మంజూరైంది. పనులు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-కిష్టారెడ్డి పాటిల్,
టీఆర్ఎస్ మండల నాయకుడు