మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి జలాశయంలోకి 3,38,900 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో 37 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు. దీంతో శ్రీశైలం వైపు 3,47,208 క్యూసెక్కుల నీరు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.508 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.