నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుల్లో నీరు వచ్చి చేరుకున్నది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం 1,17,100 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకుగాను ప్రస్తుతం 1085.40 అడుగుల నీటిమట్టం ఉన్నది. శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు. ఇప్పుడు 68.113 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
కామారెడ్డిలోని నిజాంసాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. ప్రాజెక్టులోకి 6,415 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతున్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం 1395.51 అడుగుల వద్ద నీరు ఉన్నది. నిజాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు. ప్రాజెక్టు నిల్వ సామర్ధ్యం 17.802 టీసీఎంలకుగాను 7.223 టీఎంసీల నీరు ఉన్నది.