నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జలాయశంలోకి ఎగువ నుంచి 84,154 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ఐటు క్రస్ట్ గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 589.40 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 310.27 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.