చెన్నై: తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మహమ్మారి కట్టడి కోసం కొన్ని కఠిన ఆంక్షలు విధించింది. అందులో భాగంగానే మద్యం అమ్మకాలకు కూడా పరిమితులు వర్తింపజేసింది. ఈ మేరకు తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) లిమిటెడ్ ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను తెరిచి ఉంచే వేళలను కుదించింది. నూతన మార్గదర్శకాల ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరిచిఉంటాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూత
దర్శకుడికి కరోనా.. చికిత్సకు సాయం చేసిన కమెడీయన్
ఇంటినుంచే ఇంజినీరింగ్ పరీక్షలు
తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు