హైదరాబాద్లో ఫ్యామిలీ పబ్ కల్చర్కు శ్రీకారం చుట్టిన ఆంత్రప్రెన్యూర్ ప్రీతిరెడ్డి మరో ఘనత సాధించింది. షెర్లాక్స్ లాంజ్ అండ్ కిచెన్కు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఆమెను ప్రతిష్ఠాత్మక ఇండియన్ అచీవర్స్ అవార్డ్ వరించింది. బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ పట్టా అందుకున్న ఆమె పలు బహుళ జాతి సంస్థల్లో పనిచేసింది. ఓ నిర్మాణ సంస్థలో ఆసియా-పస్ఫిక్ రీజియన్ హ్యూమన్ రిసోర్సెస్ హెడ్గా సేవలు అందించింది. తర్వాత స్వదేశానికి వచ్చిన ఆమె ఆంత్రప్రెన్యూర్ అవతారమెత్తి షెర్లాక్స్ లాంజ్ అండ్ కిచెన్ ప్రారంభించింది. తను ఎంచుకున్న రంగంలో సక్సెస్ సాధించడంతోపాటు స్వయం సాధికారత కోసం ప్రయత్నిస్తున్న మహిళలకు ఆదర్శంగా నిలిచింది. సక్సెస్ఫుల్ ఆంత్రప్రెన్యూర్గా నిలిచిన ప్రీతిరెడ్డి గతంలోనూ నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నది. తాజాగా ఇండియన్ అచీవర్స్ అవార్డు రావడం ఆనందంగా ఉందని, తన బాధ్యతను మరింత పెంచిందని చెబుతున్నది ప్రీతిరెడ్డి.