హైదరాబాద్: నగర శివార్లలోని రాజేంద్రనగర్లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో ఉంటున్న కానిస్టేబుల్ బండ వాసు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వాసు.. జాతీయ పోలీసు అకాడమీలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కుటుంబ కలహాల వల్లే వాసు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.