వరంగల్ రూరల్ : పార్టీలో వస్తున్న అంతర్గత విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎరబెల్లి వరదరాజేశ్వర్రావు తెలిపారు. బుధవారం జిల్లాలోని వర్ధన్నపేట మండలకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలవ్వడం ఎంతో కలచివేసిందన్నారు. ఈ నేపథ్యంలో మాజీ మేయర్ ఎరబెల్లి స్వర్ణతో పాటు తాను కూడా పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి దవాఖాన నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఆయనను కలుస్తామని అన్నారు.
అలాగే త్వరలోనే పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని వరద రాజేశ్వర్రావు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : హార్వెస్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
పాలమూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం
ఎన్నారైలు ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంటే..