జమ్మికుంట, జూన్ 7: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ దంసాని విజయతోపాటు కాంగ్రెస్ నాయకుడు కుమార్, పలువురు వార్డు మెంబర్లు, యూత్ క్లబ్ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. సోమవారం హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్ కిట్స్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో వీరంతా రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ కౌన్సిలర్ సుగుణ
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకురాలు బోగం సుగుణ, నాయకుడు వెంకటేశ్ టీఆర్ఎస్లో చేరారు. సోమవారం వీరు హన్మకొండలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.