నిజామాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రతి కార్యకర్త పార్టీ పాటిష్టానికి కృషి చేయాలని తెలిపారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందన్నారు. పార్టీలో చేరిన వారిలో మర్రి గౌతమ్ కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ఉపాధ్యక్షుడు, క్యాతం మధు, గడ్డం రాము, కనుగుర్తి శంకర్ తదితరులు ఉన్నారు.
కార్యక్రమంలో పూర్ణానందం, నాగులపల్లి అంజిరెడ్డి ,క్యాతం దేవేందర్, బోనగిరి రమేష్, పెద్దకాపుల శ్రీనివాస్, సోమిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.