సంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసలపర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కంగ్టి మండలంలోని సిద్దంగిర్గ గ్రామానికి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం నారాయణఖేడ్లోని క్యాంపుకార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. చేరిన వారిలో కాంగ్రెస్ వార్డు సభ్యుడు రమేశ్ కాంగ్రేస్ కార్యకర్తలు భీమప్ప, అర్జున్, శిరోమణి, సుభాశ్, ఏశప్ప, జైవంత్, నర్సు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిద్దు పాటిల్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు నందు పాటిల్, పవన్ పాటిల్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.