కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి బయటపడేందుకు మంచి ఆహారాలు తీసుకోవాల్సి రావడంతో అవి కాస్తా కొండెక్కి కూర్చున్నాయి. నిమ్మకాయ మొదలుకుని నారింజ వరకు.. బాదాం మొదలుకుని వాల్నట్ వరకు అన్నీ ఖరీదుగా మారడంతో సామాన్యులు కొని తినే స్థోమతలేక విలవిల్లాడుతున్నారు. కరోనా వేళ మార్కెట్లు వెలవెలపోతుండటంతో అందుబాటులో ఉన్న కాస్తా పండ్లు , కూరగాయల ధరలు నాలుగు రెట్లు పెరిగిపోయాయి.
కరోనా వైరస్ నుంచి ప్రజలు తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సాధ్యమైనంత పనులు చేస్తున్నారు. తమ బడ్జెట్కు మించి ఖర్చు చేస్తున్నారు. వైరస్ సోకకుండా ఉండేందుకు సమతుల ఆహారం కోసం డిమాండ్ పెరుగడంతో సామాన్యలు కొనలేని పరిస్థితి నెలకొన్నది. రోగనిరోధక శక్తిని పెంచడానికి పండ్లు, కూరగాయల వాడకం పెరుగడం ప్రారంభవడంతో వాటి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. నిమ్మకాయలు, నారింజ, యాపిల్, చికు, కివీస్తో పాటు అనేక ఇతర సీజనల్ పండ్లు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ, పరిసరాల్లో కరోనా రికార్డు స్థాయిలో పెరుగడంతో జ్యూసీ పండ్లు, కూరగాయాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. కొబ్బరి బోండాం ధర గతంలో రూ.40-50 లుగా ఉండగా.. ప్రస్తుతం రూ.120 కి చేరింది. శరీరానికి విటమిన్ సీ అందించే నిమ్మకాయలను గతంలో కిలోకు రూ. 60-80 గా ఉండేది. ఇప్పుడు కిలోకు రూ.200 చొప్పున అమ్ముతున్నారు. అంటే, ఒక నిమ్మకాయ రూ.10-15 కు లభిస్తుందన్నమాట.
మొన్నటి వరకు రూ.15-20 కు దొరికే కివి ఫ్రూట్.. ఇప్పుడు రూ.60 కు పెరిగింది. యాపిల్ ధర కూడా రూ.100 నుంచి రూ.200 లు దాటింది. దిగుమతి చేసుకున్న యాపిల్ ధర రూ.300 కి దగ్గరగా ఉన్నది. అదేవిధంగా అరటి కూడా డజన్కు రూ.40 నుంచి రూ.70 లకు పెరిగింది.
పండ్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇమ్యూనిటీ కోసం పరితపించే వారు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అయితే, యాపిల్, కివి, అరటితో సమానంగా పోషకాలు ఉన్న ఇతర చవకైన పండ్లు కూడా తినడం మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. బొప్పాయి రెండు ముక్కలు తింటే చాలు తగినంత విటమిన్ ఏ, సీ అందుతాయని, ఎండిన గూస్బెర్రీ పౌడర్ నుంచి తగినంత విటమిన్ సీ ని పొందవచ్చని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన మామిడిని తినడం చాలా మంచిదంటున్నారు నిపుణులు. సీజనల్గా దొరికే పండ్లను ఎక్కువ తినడం అలవాటు చేసుకోవడం వల్ల భవిష్యత్ లో మరింత ఆరోగ్యకరంగా ఉంటారంటున్నారు.
జూలై కల్లా ముగియనున్న కరోనా సెకండ్ వేవ్ : ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు
ఐరోపాలో ముగిసిన రెండో ప్రపంచ యుద్ధం.. చరిత్రలో ఈరోజు
బెంగాల్ స్పీకర్గా బిమన్ బెనర్జి.. వరుసగా మూడోసారి ఎంపిక..!
మార్స్పై నాసా హెలికాప్టర్ చక్కర్లు.. తొలిసారి ఆడియో కూడా రికార్డ్.. వీడియో
ఆగస్టు నాటికి బ్రిటన్లో కరోనా అంతం
కోవిడ్తో ఊపిరితిత్తులే కాదు.. రక్తనాళాలకూ సమస్యే
చైనా సినోఫార్మ్ వ్యాక్సిన్కు WHO అనుమతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..